శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (10:33 IST)

జగన్ సునామీ : నాలుగో అతిపెద్ద పార్టీగా వైకాపా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓట్ల సునామీ సృష్టించారు. ఫలితంగా మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో వైకాపా 151 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే, 22 లోక్‌సభ సీట్లలో గెలుపొందింది. ఫలితంగా సత్తాచాటి.. దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేల తర్వాత అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీగా అవతరించింది. దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కాగా, బీజేపీకి 303, కాంగ్రెస్‌ పార్టీకి 52, డీఎంకేకు 36 స్థానాలు లభించాయి. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలిచి, నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి తర్వాత శివసేన 18, జేడీ (యూ) 16, బీజేడీ 12, బీఎస్పీ 10, తెరాస 9, ఎస్పీ 5, ఎన్సీపీ 4 స్థానాలతో నిలిచాయి. మిగతా సీట్లను టీడీపీ, అన్నాడీఎంకే సీపీఐ సహా ఇతరులు దక్కించుకున్నారు.