అక్బరుద్దీన్ పై ప్రభుదాస్ అనే వ్యక్తి ఎన్ఐఎకి ఫిర్యాదు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆయన మెడకు రోజురోజుకీ ఉచ్చు మరింత బిగుస్తున్నాయి. శ్రీరాముని తల్లిపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అలాంటి వ్యక్తి బహిరంగ సభల్లో మాట్లాడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ప్రభుదాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.