కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధపడుతుంటే చంద్రబాబు నాయుడు చేతకానివాడిలా చేతులు ముడుచుకుని కూర్చున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తెలుగుజాతి సమైక్యత కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉండి తెలుగు నేలను ముక్కలు చేస్తుంటే అసహాయంగా చూస్తున్న చంద్రబాబు ఇక ఎంతమాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిలో ఉండటానికి వీల్లేదని అన్నారామె.