శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (13:02 IST)

ట్రైన్ యాక్సిడెంట్: 12 చిన్నారులను డిశ్చార్జ్ చేసిన వైద్యులు

మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై నగరంలోని యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చిన 12 మంది చిన్నారులను ఆస్పత్రి నుండి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 
 
ప్రస్తుతం వార్డులో దర్శన్‌, ఫాతిమా, నితూషాలు చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. వీరిలో శరద్‌ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, ప్రశాంత్‌, వరుణ్‌ పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. 
 
కాగా మెదక్ జిల్లా ఘటనలో 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రైలు రావడాన్ని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా రైలు పట్టాలు దాటడంతో స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంగతి తెలిసిందే.