శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (15:20 IST)

​మూగ బాలికపై కామాంధుడి అత్యాచారం...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్ర

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయగా అత్యాచారం జరిగినట్టు తేలింది. 
 
కాగా, కూలిపని చేసుకునే తల్లిదండ్రులు మూగ బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి పనికి వెళ్లారు. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం జరిగింది. ఎవ‌రూ లేక‌పోవ‌డంతో చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. అయితే.. చిన్నారి మూగ అమ్మాయి కావ‌డంతో జ‌రిగిన దారుణాన్ని త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించ‌లేక‌పోయింది. 
 
దీంతో ఆనంద్ మూక్ బ‌ధిర్ సంస్థ కు త‌న‌ను తీసుకెళ్ల‌గా.. వాళ్ల ద్వారా బాలిక‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని తెలుసుకున్న త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.