శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (14:20 IST)

వ్యాపం స్కామ్ మృతుల సంఖ్య 47 కాదు.. 34 మంది మాత్రమే : కేంద్ర హోంశాఖ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం స్కామ్ (మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు)లో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయింది 34 మంది మాత్రమేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో పరోక్షంగా, ప్రత్యక్షంగా సంబంధం ఉండి మృత్యువాత పడినవారు దాదాపు 47 వరకు ఉందని మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై కేంద్ర హోంశాఖ బుధవారం లోక్‌సభలో వివరణ ఇచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో 34 మంది మాత్రమే మరణించారని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ పార్లమెంటుకు సమాచారం పంపింది. మధ్యప్రదేశ్ అందించిన సమాచారం మేరకే ఈ లెక్క చెబుతున్నామని కూడా ఆ శాఖ పార్లమెంటుకు తెలియజేసినట్టు పేర్కొంది.