శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:40 IST)

చంకనేసుకుని పొలంగట్లకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై బురదలో వేసి తొక్కేశాడు...

వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివర

వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గణపవరం మండలం కేశవరం గ్రామానికి చెందిన గంగిరెద్దుల జాతికి చెందిన బొడ్డి ఏసు (50) సంత మార్కెట్‌లో డేరాలు వేసుకుని జీవిస్తున్నాడు. గత నెల 29వ తేదీన ఉగాది రోజున ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో తన మనుమరాలు మేరీ రాణిని (రెండున్నరేళ్ళు) రాత్రి 8 గంటల సమయంలో చంకనేసుకుని సమీప పొలం గట్ల వద్దకు తీసుకువెళ్ళి లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత అతికిరాతకంగా బురదలోకి తొక్కి చంపేశాడు.
 
పిమ్మట ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి.. తెల్లవారుజామున భిక్షాటన కోసం వెళ్ళిపోయాడు. ఇదిలావుంటే తన కుమార్తె కనబడకపోవడంతో ఏసు కుమారుడు, కోడలు రాత్రి నుంచి వెతకగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పంటబోదె బురదలో మృతదేహం లభ్యం కనిపించింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది తన మామ ఏసేనని గుర్తించి కోడలు పోసమ్మ గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంత ఏసును అరెస్టు చేశారు.