శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (11:30 IST)

టీచర్ వేధింపులు: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న 8వ తరగతి విద్యార్థి!

టీచర్ వేధింపులకు తాళలేక ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు ఓ 8వ తరగతి విద్యార్థి. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఆ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
 
ఫరీదాబాద్‌లోని హోలీ చైల్డ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్కూల్‌లోని ఓ టీచర్ రోజూ వేధించటమే కాకుండా అందరిముందూ హేళన చేస్తున్నారని 8వ తరగతి విద్యార్థి బాత్ రూంలోకి వెళ్లి తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. 
 
బాలుడి శరీరం 40 శాతానికి పైగా కాలడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. బాలుడి స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు, అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.