గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (09:13 IST)

గాంధీ ఆసుపత్రిలో తొమ్మిది నెలల పసిపాప కిడ్నాప్...

హైదారాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తొమ్మిది నెలల పసిపాపను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్, రేణుక దంపతుల కుమార్తె కావ్య. పాపకు అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తీసువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాపను శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.
 
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరి విచారణ జరిపారు. విచారణలో ఓ మహిళ పాపను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తొమ్మిది నెలల పసిపాప కిడ్నాప్ సంఘటన ఆస్పత్రి ప్రాంగణంలో కలకలం రేపింది.