బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (16:32 IST)

బడి పంతుల్ని చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత.. కేసు నమోదు!

విశాఖపట్టణం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వెంగలపూడి అనిత ఓ బడి పంతుల్ని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... తనను ఎమ్మెల్యే అనిత నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ఉపాధ్యాయుడు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఎమ్మెల్యే అనితను అరెస్టు చేయాలని బాధితుని బంధువులు, సహచరులు పాయకరావుపేట పీఎస్ వద్ద ధర్నా చేస్తున్నారు. అనితతో పాటు ఎమ్మెల్యే పీఏ ప్రసాద్, ఎంపీటీసీ కాశీ విశ్వనాథ్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రామరావు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మరోవైపు ఎమ్మెల్యే అనిత వ్యవహారశైలిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.