మగ బిడ్డ కావాలట... రెండో పెళ్లికి కానిస్టేబుల్ రెడీ.. ఫిర్యాదు చేసిన భార్య
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసోడు... అప్పటికే నలుగురు ఆడబిడ్డలకు తండ్రి. పెళ్ళాముంది. అతగాడికి మగబిడ్డ పిచ్చి పట్టుకుంది. భార్యను హింసించడం మొదలు పెట్టాడు. మగ సంతానం కోసం అంటూ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. తను, తన పిల్లల జీవితం రోడ్డుపాలవుతుందని భార్య ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. వివరాలిలా ఉన్నాయి.
మెదక్ జిల్లా గద్వేల్ మండలం బేగంపేటకు చెందిన బాలలక్ష్మి, నర్సింహులు భార్యాభర్తలు. కానిస్టేబుల్ అయిన నర్సింహులు తనకు నలుగురు ఆడపిల్లలే పుట్టారు. నలుగురూ అడపిల్లలే పుట్టారని, మగ సంతానం కోసం రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. భార్య వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు భరించలేక కానిస్టేబుల్పై అతని భార్య తన పిల్లలతో కలిసి శుక్రవారం మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది.
భర్త మరో పెళ్లి చేసుకుంటే తాను, పిల్లలు రోడ్డున పడతామని ఫిర్యాదులో పేర్కొంది. భర్త నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని బాలలక్ష్మి కోరింది. ఆమె ఫిర్యాదుని పరిశీలించిన మానవహక్కుల సంఘం దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి ఆగస్టు 26వ తేదీ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని మెదక్ ఎస్పీని ఆదేశించింది.