గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:06 IST)

కొవ్వూరులో దారుణం.... వ్యక్తి తల పగలగొట్టి మెదడు తినేసిన సైకో...

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద ద

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద దెబ్బ వేసి తలను ఛిద్రం చేశాడు. 
 
దీనితో అతడి మెదడు బయటకు వచ్చేసింది. మతి స్థిమితం లేని వ్యక్తి ఆ మెదడును తీసుకుని తినేశాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. అంతా కలిసి అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.