గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 27 జులై 2015 (13:51 IST)

వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్న భర్త.. కేబుల్ వైరుతో హతమార్చిన భార్య..

సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఓ దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పర పురుషుడితో వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్న భర్త గొంతును కేబుల్ వైరుతో బిగించి హత్య చేసింది ఓ కసాయి భార్య. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లాలో కె.కోటపాడు మండలం మర్రివలస గ్రామానికి చెందిన కొండమ్మ అలియాస్ దొంగు దుర్గాలమ్మ భర్తతో అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. 
 
కొండమ్మకు అదే ప్రాంతంలో మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుసార్లు హెచ్చరించాడు. అయితే భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్రంగా ఖండించాడు. ఈ స్థితిలో తన భర్త నిద్రపోతుండగా ఆయన మెడకు కేబుల్ వైరు బిగించి ఊరితీసి చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కొండమ్మను అదుపులోకి చేరుకుని విచారిస్తున్నారు. ఆమె భర్త మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.