శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (19:45 IST)

ఆ టీవీలను జనం అడగలేదట: కేసీఆర్‌కు సుభాష్ రెడ్డి చెంచాగిరి..?

తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం నిలిపివేసిన నేపథ్యంలో.. ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కేబుల్ ఆపరేట్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మాత్రం కొత్త కథ చెబుతున్నారు. 
 
టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారంపై జనమే నోరెత్తట్లేదని.. ఆ రెండు ఛానెళ్లకు సంబంధించి ప్రసారాలు అవసరమా అనే చందంగా ప్రశ్నించారు. అయితే సుభాష్ రెడ్డి కామెంట్స్‌పై జర్నలిస్టులు మండిపడుతున్నారు. కేసీఆర్‌కు సుభాష్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడుతున్నారు. జనం వద్దన్నా కావాలన్నా ఆ టీవీ ప్రసారాలు చేయాల్సింది పోయి.. ఛానెళ్ల నిషేధంపై సమర్థించుకోవడం.. ఎంతవరకు న్యాయమని అడుగుతున్నారు. 
 
‘‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్రగానీ ఏమీ లేదని, న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చాయి.

మాతో వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదు’’ అని సుభాష్ రెడ్డి వ్యాఖ్యానించడం వెనుక కేసీఆర్ హస్తం లేకపోలేదని వాపోతున్నారు. ప్రజాస్వామ్యంగా తెలంగాణ సర్కారు వ్యవహరించట్లేదని, అందుకే సుభాష్ రెడ్డి లాంటి వారిచే ఆ రెండు ఛానెళ్లకు సంబంధించిన కామెంట్స్ చేయిస్తుందని జర్నలిస్టులు మండిపడుతున్నారు.