శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (13:16 IST)

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన గండం...

టీడీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వెంట్రుక వాసిలో ముప్పు తప్పి సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారంనాడు జీరో అవర్లో టీడీపీ ఎమ్మెల్యే కొమ్ములపాటి శ్రీధర్ ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి కర్టెన్ ఇనుప రాడ్ ధబేల్ మంటూ శబ్దం చేస్తూ జారి కిందపడింది. ఇనుప రాడ్ శబ్దంతో అక్కడ ఏం జరిగిందో కొద్దిసేపు తెలియలేదు. 
 
కాగా ఆ రాడ్ ఎమ్మెల్యేలకు కొద్ది దూరంలో పడటంతో అంతా ఒక్కసారి షాక్ కు గురయ్యారు. ఐతే అది కొద్ది దూరంలో పడటంతో ప్రమాదం నుంచి ఎమ్మెల్యేలు సురక్షితంగా బయటపడ్డారు. కింద పడ్డ ఆ ఇనుప కడ్డీని మార్షల్స్ తొలగించారు. ఐతే అసెంబ్లీలో అరకొర సౌకర్యాలతోనే ఏపీ ఎమ్మెల్యేలు సర్దుకుపోతున్నారు.