శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 30 నవంబరు 2015 (14:23 IST)

పేరులోనే శ్రీరామ... రావణాసురుడు బుద్ధి... అతడికి విధించే శిక్ష...?!!

చిత్తూరు మేయర్ అనురాధ దంపతులను అత్యంత దారుణంగా ఈ నెల 17 హత్య చేసిన చింటూ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా కోర్టు ముందు లొంగిపోయాడు. ఇతడి పేరులో శ్రీరామ అనే పేరు ఉన్నప్పటికీ రావణాసురుడిలా మారిపోయాడు. రాక్షసుడిలా సొంత అత్త, మామయ్యలను హతమార్చాడు. కాగా అతడి కోసం రెండు వారాలుగా పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్న తరుణంలో చింటూ నేరుగా చిత్తూరులోని జిల్లా కోర్టుకు వచ్చి సోమవారం లొంగిపోవడం గమనార్హం. 
 
కేసులో సంబంధం ఉందని భావిస్తున్న చింటూ ప్రధాన అనుచరులు ముగ్గురిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్న సమయంలోనే చింటూ కోర్టులో లొంగిపోవడం గమనార్హం. చింటూ లొంగుబాటుతో కఠారి మోహన్ దంపతుల కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 
 
కాగా, సొంత మేనత్త అయిన కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌లను చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఇద్దరిని హత్య చేసినందుకు చింటూకు కోర్టు ఉరి శిక్ష విధిస్తుందా... లేదంటే యావజ్జీవమా అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా చింటూ లొంగుబాటు సమయంలో కోర్టు బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.