భగ్గుమన్న రైతన్న : రుణమాఫీపై చంద్రబాబు వైఖరిపై ఫైర్!
రైతన్న భగ్గుమన్నాడు. రుణమాఫీ, రీషెడ్యూల్పై ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రైతులు, మహిళలు రెండవ రోజు శుక్రవారం కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను దగా చేస్తున్న చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
అనంతరం నరకాసుర వధ పేరుతో వైకాపా నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సుజయ్కృష్ణరంగరావు మాట్లాడుతూ ఒక్క పైసా కూడా కట్టకూడదని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత సరైన విధివిధానాలు, స్పష్టత లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.