గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (12:39 IST)

మస్తాన్ వలీ శారీరకంగా హింసించాడు: నీతూ అగర్వాల్... వెక్కి వెక్కి ఏడుస్తూ..

ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్ మీడియా ముందుకు అనేక విషయాలు తెలిపింది. హైదరాబాద్ నుంచి బెంగలూరు పారిపోతున్న క్రమంలో నీతు కర్నూలు జిల్లా ఉలిందకొండ సమీపంలో పోలీసులకు పట్టుబడింది.

ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెక్కివెక్కి ఏడుస్తూనే నీతూ పలు విషయాలను మీడియాకు వివరించింది. 
 
మస్తాన్ వలి తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని నీతూ తెలిపింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాలుపంచుకోవాలని అతడు తనను వేధించాడని కూడా తెలిపింది. అతడి వేధింపులు తట్టుకోలేక అతడికి లొంగిపోయానని, ఆ క్రమంలోనే ఈ రొంపిలోకి దిగాల్సి వచ్చిందని వెల్లడించింది. మస్తాన్ వలితో సంబంధాలు ఏర్పడ్డ తర్వాత నీతూ, తన కుటుంబానికి దూరమైంది. 
 
తాజాగా ఎర్రచందనం కేసులో నీతూ అరెస్టైన విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కర్నూలు చేరుకున్నారు. ఇదిలా ఉంటే, మస్తాన్ వలి అరెస్ట్ కావడం, స్మగ్లింగ్‌లో తన ప్రమేయం ఉందని బయటపడటంతో నీతూ పోలీసులకు లొంగిపోవాలని యత్నించిందట. ఈ మేరకు ఆమె మధ్యవర్తుల ద్వారా పోలీసులకు సమాచారం కూడా అందించింది. అయితే లొంగుబాటు యత్నాలు ఫలించకముందే ఆమె బెంగళూరు పారిపోతూ పోలీసులకు పట్టుబడింది.