శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (14:04 IST)

మంగళగిరిలోనే ఎయిమ్స్.. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను నెలకొల్పనున్నారు. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎయిమ్స్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 
 
బుధవారం ఉదయం ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన విషయం తెల్సిందే.