గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్!
విజయవాడ: గన్నవరం విమానశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల అత్యవసరంగా ల్యాండ్ అయింది. 116 మంది ప్రయాణికులున్న విమానాన్ని ఎయిర్ పోర్ట్లో అర్ధంతరంగా దించేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందని, విమానం షెడ్యూల్ ఇక లేదని ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. దీనిపై గన్నవరం విమానశ్రయంలో ఎయిర్ ఇండియా అధికారులతో 60 మంది హరిద్వార్ యాత్రికులు వాగ్వివాదానికి దిగారు. తమని ఈరోజే ఢిల్లీ పంపించాలంటూ అందోళన చేశారు.