శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (17:57 IST)

"సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావమ్మా... లక్ ఉండాలి" : అల్లు శిరీష్

'డబ్బులు ఊరికే రావు' అనేది లలితా జ్యూవెలరీ ఎండీ కిరణ్ కుమార్‌ డైలాగ్. సెల్ఫీలు ఊరకే రావు అన్నది టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్‌ది. ఇంతకీ వీరిద్దరి డైలాగుల గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకనే కదా మీ సందేహం

'డబ్బులు ఊరికే రావు' అనేది లలితా జ్యూవెలరీ ఎండీ కిరణ్ కుమార్‌ డైలాగ్. సెల్ఫీలు ఊరకే రావు అన్నది టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్‌ది. ఇంతకీ వీరిద్దరి డైలాగుల గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకనే కదా మీ సందేహం.
 
నిజానికి లలితా జ్యూవెలరీ ఎండీ గుండు బాస్ (కిరణ్ కుమార్) చెప్పే యాడ్ బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈయనతో మెగా హీరో అల్లు శిరీష్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు శిరీష్ చెప్పే డైలాగ్ అందరినీ నవ్వులు పూయిస్తోంది.
 
ఇటీవల అల్లు శిరీష్ విమానంలో ప్రయాణిస్తుండగా ల‌లిత జ్యూయ‌ల‌ర్స్ ఎండీ కిర‌ణ్ కుమార్‌‌ కూడా ఆ విమానం ఎక్కారు. వెంట‌నే ఆయ‌న‌తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఆ ఫోటోని మంగళవారం త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దానికింద.. "సెల్ఫీలు ఎవ‌రికీ ఊరికే రావు. అదృష్టం ఉండాలి. హ‌హ‌హ‌.." అంటూ ల‌లితా జ్యూవెల‌రీ యాడ్‌లో కిర‌ణ్ కుమార్ చెప్పిన స్టైల్లోనే కామెంట్ చేశాడు. 
 
ఈ ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. శిరీష్ న‌టించిన మ‌ల‌యాళ మూవీ తెలుగులో "యుద్ధభూమి" పేరుతో ఈనెల 29వ తేదీన విడుదలకానుంది. ప్రస్తుతం మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్బెన్ సినిమాస్ బ్యానర్‌లపై మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్న ఏబీసీడీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో  డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.