ఒకవైపు చందాలడుగూ.. దుబారా ఖర్చులెందుకు బాబూ?
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఒకవైపు కొత్త రాజధాని నిర్మాణానికి చందాలడుగుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు దుబారా ఖర్చులు చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు హాజరవుతున్న అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ సమావేశానికి ముందు, ఆ తరువాత పలు దేశాల్లో పర్యటించి రాష్ట్ర ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారని ప్రశ్నించారు.
‘‘అక్టోబర్ 2 నుంచి కామెరూన్లో జరిగే సదస్సుకు హాజరవుతున్న కోడెల దానికన్నా ముందు మారిషస్, జోహాన్నెస్బర్గ్, సదస్సు ముగిశాక కేప్టౌన్, కెన్యాల సందర్శనకు వెళుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేదని ప్రభుత్వమే చెబుతున్నపుడు ఈ పర్యటనలెందుకు?’’ అని అంబటి ప్రశ్నించారు.