సీఎంతో మాట్లాడి నీ సంగతి తేలుస్తా, శ్రీకాళహస్తిలో ఆనం తనయుడి వీరంగం...
తిరుపతి : శివరాత్రికి సామాన్య భక్తులతో శైవ క్షేత్రాలు రద్దీగా ఉంటే... మరో పక్క వి.ఐ.పి.ల వికారాలు ఎక్కువవుతున్నాయి. ప్రతివారు తమకు ప్రత్యేక దర్శనం కావాలంటూ పవిత్ర దేవాలయాలలో గలాటా సృష్టిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఆనం రామనారాయణ రెడ్డి తనయుడు వీరంగం సృష్టించాడు.
శివరాత్రి సందర్భంగా తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తెచ్చారు. ఆమె నిరాకరించడంతో ఈవోపై ఆనం శుభకర్ రెడ్డి చిందులు వేశాడు. నీ సంగతేమిటో తేలుస్తానంటూ ఈవో భ్రమరాంబను దూషించారు ఆనం శుభకర్ రెడ్డి. గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా... సీఎంతో మాట్లాడి నీ కథ తేలుస్తానంటూ నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు అక్కడివారు చెపుతున్నారు.