శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (13:25 IST)

చంద్రబాబు అవమానిస్తున్నారు.. తిట్టిన నోటితో పొగిడి.. జగన్‌ చెంతకెళ్తా... ఆనం వేవికా

నెల్లూరు సోగ్గాడుగా పేరొందిన ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆయన అనుచరులు నిత్యం అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. అందుకే టీడీపీని వీడాలని భావిస్

నెల్లూరు సోగ్గాడుగా పేరొందిన ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆయన అనుచరులు నిత్యం అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. అందుకే టీడీపీని వీడాలని భావిస్తున్నారు. ముఖ్యంగా.. అడుగడుగునా అవమానించడమే కాకుండా, ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చలేదన్న కోపంతో ఆయన రగిలిపోతున్నారు. 
 
పైగా, గత 15 నెలలుగా టీడీపీలో కొనసాగతున్నప్పటికీ.. అది కలతల కాపురంగానే కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అదేసమయంలో వైకాపా చెంతకు చేరాలని భావిస్తున్నారు. తిట్టిన నోటితోనే జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించాలని వివేకా కోరుతున్నారు. 
 
నిజానికి ఆనం సోదరులు కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2016 జనవరి 17న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సీఎం సమక్షంలో ఆనం బ్రదర్స్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు, వివేకాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
 
చెప్పినట్లుగానే ఆరు నెలల తరువాత ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు రామనారాయణరెడ్డికి అప్పగించారు. కాని వివేకాకు ఇస్తామన్న ఎమ్మెల్సీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో ఇదే విషయాన్ని సీఎంతో చర్చించి ఎమ్మెల్సీ అవకాశం ఇప్పించాలని ప్రయత్నాలు చేశారు. 
 
ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి తనకు ఎమ్మెల్సీ అవకాశం తనకు ఇస్తే రాష్ట్ర కేబినెట్‌లో స్థానం దక్కుతుందని ఇందుకు సోదరుడు వివేకా సహకరించాలని కోరారు. ఈ విషయంలో ఆనం సోదరుల మధ్య కొంత వివాదం నడిచినట్లు ప్రచారం సాగింది. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఆనం సోదరులకు ఎమ్మెల్సీ అవకాశం దాదాపు లేనట్లుగానే ప్రచారం సాగుతోంది.