శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (15:24 IST)

ప్రేమించారు.. వరుసకు అన్నాచెల్లెళ్లని రైలుకింద పడిపోయారు!

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రైలుకింద పడి యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. తరువాత వీరి ప్రేమను పెద్దలకి తెలియజేయగా, వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని చెప్పిన పెద్దలు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. 
 
దీంతో తామిక కలిసి బతికేది లేదని నిర్ణయించుకున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబసభ్యుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.