శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (10:59 IST)

శ్రీశైలం - నాగార్జున సాగర్‌ డ్యాంలను స్వాధీనం చేసుకోండి : ఏపీ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారుతున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
 
కృష్ణా జలాలను వినియోగించుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం వివాదం చేస్తోందని, సమస్యను పరిష్కరించుకుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ, ఘర్షణాత్మక వైఖరి వీడడం లేదని ఆరోపిస్తూ కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించింది. 
 
సాగర్ కుడి కాల్వకు గేట్లు ఆపరేట్ చేస్తున్న సిబ్బంది తెలంగాణకు చెందిన వారు కావడంతో, ఏపీకి సకాలంలో నీటిని విడుదల చేయడం లేదని, దాని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ, కేంద్రానికి తెలిపింది. రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.