శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (13:31 IST)

పవన్ ఎఫెక్ట్.. చంద్రబాబు స్పందన.. రాజధానిని 5వేల లేదా 50వేల ఎకరాల్లోనూ...

పవన్ కల్యాణ్ ఏపీ పర్యటన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన వాదనను మరోమారు బలంగా వినిపించారు. తుళ్లూరు పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, అక్కడి రైతులతో భేటీ సందర్భంగా, తక్షణమే భూ సమీకరణను నిలిపేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఈ విషయంపై సర్కారుతో మాట్లాడతానని చెప్పిన పవన్, అవసరమైతే సర్కారుకు వ్యతిరేకంగా దీక్షకు దిగేందుకూ వెనుకాడబోనని ప్రకటించారు.
 
పవన్ ప్రసంగం ముగిసిన కొద్దసేపటికే హైదరాబాదులో చంద్రబాబు స్పందించారు. అయితే పవన్ వ్యాఖ్యలను ఎక్కడా ప్రస్తావించని ఆయన తన ప్రభుత్వ ఉద్దేశాన్ని సుస్పష్టం చేశారు. జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన సందర్భంగా మాట్లాడిన ఆయన ‘‘నవ్యాంధ్ర రాజధానిని 5 వేల ఎకరాల్లో కట్టొచ్చు, 50 వేల ఎకరాల్లోనూ కట్టొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. రాజధాని వల్ల తుళ్లూరు రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు స్వచ్ఛందంగానే ముందుకొచ్చారని బాబు పేర్కొన్నారు.