శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (18:57 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ జూన్ 2గా ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. జూన్ 2న తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం జల వివాదం గురించి కూడా మంత్రివర్గం చర్చించింది. రాజధాని భూ సమీకరణపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. 
 
అంతేకాకుండా, తిరుమలలో అన్యమత ప్రచారంపై మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర మతాలను గౌరవిస్తూనే అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే, నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో తన సింగపూర్, జపాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి వెల్లడించారు.