శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:00 IST)

ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదాలకు చర్చలే పరిష్కారం: గవర్నర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు అవసరమని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. 
 
దీపావళి సందర్భంగా నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... వివాదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. 
 
శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోన్న నేపథ్యంలో ఈ వివాదాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని నరసింహన్ పేర్కొన్నారు.