గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (13:00 IST)

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఓ శుభవార్త: మే 1 నుంచి కొత్త వేతనాలు!

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఓ శుభవార్త. రాష్ట్రం విడిపోయాక మే 1 నుంచి భారీగా పెరిగిన వేతనాలను ఉద్యోగులకు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకుబ బుధవారం జరిగిన భేటీలో ఏపీ కేబినెట్ తీర్మానించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. 
 
తెలంగాణ సర్కారు కంటే ఒక్క శాతం తగ్గినా ఫిట్ మెంట్‌ను అంగీకరించేది లేదన్న ఉద్యోగుల వాదన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా 43 శాతం ఫిట్ మెంట్‌ను ప్రకటించింది. అయితే పెంచిన వేతనాలు ఇప్పటిదాకా ఉద్యోగులకు అందనే లేదు. ఉద్యోగుల విన్నపాలకు స్పందించిన చంద్రబాబు నిన్నటి కేబినెట్ భేటీలో దీనిపై ప్రత్యేకంగా చర్చించి, మే 1 నుంచే కొత్త వేతనాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు.