శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 25 అక్టోబరు 2014 (16:31 IST)

ఏపీ రాజధాని కోసం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ రూ.2,52,47,259 విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ సంస్థల తరపున సేకరించిన విరాళం దాదాపు రూ.2.5 కోట్లకు పైగా ఉన్న డబ్బును చెక్ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ అందజేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర రాజధాని కోసం విరాళాలను ఇవ్వాల్సిందిగా ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ పిలుపునిచ్చిన విషయం విదితమే. 
 
వారి పిలుపునకు స్పందించి దాతలు ఈ మొత్తాన్ని ఆ సంస్థలు తెలిపిన బ్యాంకు ఖాతాలకు పంపారు. రూ. 1.65 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ కాగా రూ. 86.87 లక్షలు ఆంధ్రబ్యాంక్ విజయవాడ శాఖలో జమయ్యాయి. ఈ రెండు బ్యాంకుల చెక్కులను చంద్రబాబు నాయుడికి శుక్రవారంనాడు వేమూరి రాధాకృష్ణ అందజేశారు.