మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (09:59 IST)

ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు... పిల్లల బతుకులు ఎలా? ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డు

suicide
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు.. పిల్లల బతుకులు ఎలా.. మేము బతికేది ఎలా..? ఏమిటీ దారుణం అంటూ కలెక్టర్‌కు ఓ లేఖ రాసి నెల్లూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రమణయ్య ఆత్మహత్యకు ముందు నెల్లూరు జిల్లా కలెక్టరు పేరిట మూడు సూసైడ్‌ నోట్‌లు రాశారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా రాక గ్రామం అభివృద్ధి చెందటం లేదని, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి బావిలోనుంచి మృతదేహాన్ని వెలికితీసేందుకు సన్నాహాలు ఆరంభించారు. ఈ విషయం తెలిసిన జనం పెద్దసంఖ్యలో బావి వద్దకు వచ్చారు.