మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (21:08 IST)

రాధేమాపై మరో రెండు కేసులు.. డబ్బులకు బెదిరించారంటూ ఫిర్యాదు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసులు నమోదయ్యాయి. రెండు అంశాలు వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్న కేసును ఎదుర్కొంటున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్‌ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. 
 
ఆమె మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్‌కు చెందిన సురేందర్‌ మిట్టల్‌ పోలీసులకు పిర్యాదు చేశారు. రాధేమా డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారని, ఇవ్వనందుకు బెదిరించారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. రాధేమాతో కలిసి ఆశ్లీల వీడియోలు చేసేదాన్నని టీవీ నటి డోలీ బింద్రా చెప్పారు.