శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (13:06 IST)

ఏపీ పరిణామాలపై కేంద్రం ఆరా.. జగన్ సర్కారుకు మూడినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలు రావడంతోనే గవర్నర్ హరిచందన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, అటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినిని సీతారాం, ఇటు మండలి ఛైర్మన్ షరీఫ్‌లతో గవర్నర్ వేర్వేరుగా మాట్లాడారు. 
 
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో 25 మంది మంత్రులు వెళ్లి పోడియంను చుట్టుముట్టడం.. టేబుల్‌పై పేపర్లు లాగివేయడం, ఛైర్మన షరీఫ్‌ను మంత, కులం పేరుతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ దూషించడం, షరీఫ్‌ను చుట్టుముట్టి నిర్బంధించడం, తదితర పరిణామాలపై ఇప్పటికే వీడియో టేపులను కేంద్రం పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
అంతేకాదు గవర్నర్‌ ద్వారా సమాచారం తెప్పించుకునే ప్రయత్నాల్లో కేంద్రం ఉంది. రెండు సభల్లో జరిగిన పరిణామాలపై స్పీకర్‌, చైర్మన్‌ నుంచి వివరాలను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో కేంద్రానికి గవర్నర్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని హోంశాఖ అధికారులు పరిలీంచనున్నారు. ఆ తర్వాత కేంద్రం చర్యలు చేపట్టే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. తమను ధిక్కరించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమదైనశైలిలో గుణంపాఠం చెప్పాలన్న ధోరణిలో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.