శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 31 మార్చి 2017 (13:49 IST)

ఎపిలో కొత్త మంత్రులు వీరే... ఇది ఫైనలట...? ప్రత్తిపాటి పుల్లారావుకు ఊడుతుందా?

తెలుగుదేశంపార్టీలోకి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో మంత్రులను తీసుకోలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడు సంవత్సరాలవుతున్నా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామంది రెండు, మూడు శాఖలను చూసుకుంటున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన

తెలుగుదేశంపార్టీలోకి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో మంత్రులను తీసుకోలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడు సంవత్సరాలవుతున్నా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామంది రెండు, మూడు శాఖలను చూసుకుంటున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్న విమర్శలు లేకపోలేదు. ఎలాగైనా మంత్రివర్గాన్ని విస్తరించాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారట. అది కూడా ఉన్న వారిలో కొంతమందిని తీసేసి కొత్తవారిని చేర్చుకోవడం. ఇది ఎప్పటి నుంచో తెలిసిందే.
 
అయితే ఉన్న మంత్రుల్లో నలుగురిని తీసేసి కొత్తగా 10 మందిని తీసుకోనున్నారని తెలుస్తోంది. అది కూడా ఏప్రిల్ 2వ తేదీనే ముహూర్తం ఖరారు చేసేశారట బాబు. ఈ విషయాన్ని ఇప్పటికే గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్ళారట. ఫైనల్‌గా మంత్రులు కానున్న వారు నారా లోకేష్‌, అఖిలప్రియ, యరపతనేని శ్రీనివాసరావు, చాంద్ బాషా, సుజయ క్రిష్ణరంగారావు, శ్రీరామ్ రాజగోపాల్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనంద్, డాక్కా మాణిక్యవరప్రసాద్, మాగుంట శ్రీనివాసులరెడ్డి. వీరందరూ కొత్తగా మంత్రివర్గంలోని వెళ్ళేవారట. 
 
ఇక మంత్రివర్గం నుంచి పదవులు పోయే వారిలో మొదటగా రావెళ్ళ కిషోర్ బాబు, సిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, మృణాళిని, పత్తిపాటి పుల్లరావులు ఉన్నారని సమాచారం. ఉన్న మంత్రుల్లో సీనియర్లు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది మంత్రుల శాఖలు కూడా మారుస్తున్నారట. వారిలో మొదటగా కె.ఈ.క్రిష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులు ఉన్నారట. మరి ఇదే మార్పు జరిగితే వీరందరూ బాబు చేసింది ఒప్పుకుంటారా.. లేక తిరగబడతారా అన్నది ఆసక్తిగా మారింది.