శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (11:49 IST)

పాత చంద్రబాబును చూస్తారు... ఈ వార్నింగ్ రైతులకు ఉద్యోగులకేనా?

త్వరలో పాత చంద్రబాబును చూస్తారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రైతులు, ఉద్యోగుల్లో తీవ్ర మథనం మొదలైంది. ‘‘పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు’’ అంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. పైగా త్వరలోనే పాత చంద్రబాబును చూస్తారంటూ తీవ్ర స్వరంతో హెచ్చరిస్తూనే.. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సిందేనని సలహా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను 24 గంటలు కష్టపడుతున్నా, అధికారుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదన్నారు. అధికారుల పనితీరులో ఇదే ధోరణి కొనసాగితే, మరో 3 నెలల్లో పాత చంద్రబాబును చూస్తారంటూ ఆయన హెచ్చరించారు. 
 
గురువారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన గుంటూరు ఆసుపత్రి ఘటన, ఇంజక్షన్ల సైకోపై కాస్త ఘాటుగా స్పందించారు. ‘గతంలో మాదిరిగా కాకుండా ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నా. ఉద్యోగులు నిర్లిప్తంగా ఉన్నా, నిరక్ష్యంగా వ్యవహరించినా గతంలో సహించేవాడిని కాదు. కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మొద్దు నిద్రను వదిలించేందుకు సన్నద్ధంగా ఉన్నాను. ఉద్యోగుల విషయంలో మరో 3 నెలల్లో పాత చంద్రబాబు చూస్తారంటూ హెచ్చరించారు.