శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (17:07 IST)

'మీ జైలుకు- నా భరోసా' ఇది జగన్ నినాదం : చంద్రబాబు

ఎన్నికల వేడి ఊపందుకుంది. దీంతో రాజకీయ నేతలు కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు. ముఖ్యంగా, పార్టీల అధినేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్లను పరిశీలిస్తే, 
 
* వైసీపీ అసలు పార్టీయేకాదు. ఆ పార్టీ గురించి, దాని నాయకుడి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. ఇంత దివాలాకోరు పార్టీని నా జీవితంలో చూడలేదు. తండ్రిని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు. చేసిన నేరాలకు జైలుకు పోయి వచ్చాడు. ఇప్పుడు మనందరికీ ధర్మపన్నాలు వల్లిస్తున్నాడు.
 
* వైసీపీలో వేలం ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాళ్లకే వైసీపీ టికెట్‌. టీడీపీలో ప్రజాసేవే అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికం. రైతులు, మహిళలు, యువతే టీడీపీకి పునాదులు. గాలికి వచ్చినోళ్లు గాలికే పోయే పరిస్థితి, మళ్లీ టీడీపీలోకి వస్తామంటే వద్దని చెప్పా. 
 
* యుద్ధానికి టీడీపీ సిద్ధంగా ఉంది. మనం అందరం పరుగు పందెంలో ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక పూర్తి కావొచ్చింది. వాస్తవాలకు దగ్గరగా అభ్యర్ధుల ఎంపిక చేశాం. అన్ని స్థానాల్లో గెలిస్తే పరిపాలన సులభతరం అవుతుంది. 25 ఎంపీ, 150 పైగా అసెంబ్లీ స్థానంలో టీడీపీ గెలిచేలా కృషిచేయాలి.
 
* మరో రెండు, మూడు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తాం. తిరుపతి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించి, శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. 'మీ భవిష్యత్తు- నా బాధ్యత' మన నినాదం. 'మీ జైలుకు- నా భరోసా' జగన్‌ నినాదం.