క్యాంప్ ఆఫీస్ కలిసి రాలేదు... కొత్త సచివాలయం అయినా... లక్కు కుదురుతుందా బాబూ...?
అమరావతి : రాజధాని లేని రాష్ట్రం... విభజన అనంతరం వేదన... రెండేళ్ళపాటు ఏ పనీ సజావుగా సాగని వైనం... ఇదీ ఏపీలో సీఎం చంద్రబాబు పాలనకు ఎదరవుతున్న అడ్డంకులు. ఇప్పటివరకు ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి పాలన సాగించారు. హైదరా
అమరావతి : రాజధాని లేని రాష్ట్రం... విభజన అనంతరం వేదన... రెండేళ్ళపాటు ఏ పనీ సజావుగా సాగని వైనం... ఇదీ ఏపీలో సీఎం చంద్రబాబు పాలనకు ఎదరవుతున్న అడ్డంకులు. ఇప్పటివరకు ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి పాలన సాగించారు. హైదరాబాదుకు పూర్తిగా స్వస్తి చెప్పారు.
కానీ, ఇక్కడ క్యాంపు కార్యాలయం అంతగా అచ్చివచ్చినట్లు లేదు. కేంద్రం నుంచి నిధులు గాని, ఏపీకి ప్రత్యేక హోదా గాని, ఏ విషయం చూసుకున్నా... ఏపీకి మోకాలడ్డే. ఇక పాలనను కొత్త సచివాలయం నుంచి నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ప్రారంభిస్తున్నారు.
కొత్త సచివాలయం నుండి ఏపీ సీఎం చంద్రబాబు తన విధులను నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి అయినా పాలన సజావుగా, ఏపీకి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సాగుతుందని తెలుగుదేశం వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.