శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 30 ఆగస్టు 2016 (19:40 IST)

ఓటుకు నోటుపై స్పందించ‌ని చంద్రబాబు... ఏముంది అందులో...?! బాబునెవరూ కాపాడలేరు... అంబటి

విజ‌య‌వాడ ‌: ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించ‌డానికి నిరాక‌రించారు. మీడియా మంగళవారమిక్కడ ఆయ‌న్ని ఈ కేసుపై ప్ర‌శ్నించ‌గా, ఆ కేసులో అసలు ఏముందని మాట్లాడటానికి అని అన్నారు. అంతేకాదు... ఆ కేసులో ఏముందో మీరే స్టడీ చేసి చెప్పాలన్నారు

విజ‌య‌వాడ ‌: ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించ‌డానికి నిరాక‌రించారు. మీడియా మంగళవారమిక్కడ ఆయ‌న్ని ఈ కేసుపై ప్ర‌శ్నించ‌గా, ఆ కేసులో అసలు ఏముందని మాట్లాడటానికి అని అన్నారు. అంతేకాదు... ఆ కేసులో ఏముందో మీరే స్టడీ చేసి చెప్పాలన్నారు. త‌మ అడ్వకేట్లు అంతా చూసుకుంటార‌నే ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేశారు.
 
మోదీ, వెంక‌య్య‌, కేసీయార్ కాద‌న్నా... ఇక‌ బాబును కాపాడ‌లేరు : అంబ‌టి
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ఎవరూ కాపాడలేరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఏసీబీ సీఎంపై చార్జి షీటు పెడుతున్న నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాబోతున్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు జోక్యం చేసుకున్నా చంద్రబాబును తప్పించలేరని అంబ‌టి జోస్యం చెప్పారు. 
 
ఈ కేసు నుంచి చంద్రబాబును రక్షించేందుకు వెంక‌య్య‌నాయుడు రాజీతో, కేసీఆర్ ప్రయత్నించార‌ని ఆరోపించారు. దానికి ప్ర‌తిఫ‌లంగా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడిక చంద్ర‌బాబును ఎవ‌రూ కాపాడలేర‌ని వ్యాఖ్యానించారు.