గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Ivr
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2015 (20:21 IST)

శంకుస్థాపనకు బాబా రాందేవ్‌ను పిలిచారు సరే... జగన్‌ను పిలిచారా...?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే రాందేవ్ బాబా చంద్రబాబు పాలన భేష్ అని కితాబిచ్చారు. ఇకపోతే ఇప్పటి ఆధునిక జీవనశైలికి యోగ, ధ్యానం ఎంతో ముఖ్యమనీ, అందువల్ల రాందేవ్ బాబాతో కలిసి తిరుపతిలో యోగ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు కామినేని.
 
ఇదిలావుంటే శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారా లేదా అనేది సస్పెన్సుగా ఉంది. దీనిపై మంత్రి నారాయణను అడిగినప్పుడు అందరూ ఆహ్వానితులే.. అంటే జగన్ మోహన్ రెడ్డిగారు కూడా ఆహ్వానితులే అని సమాధానమిచ్చారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది కూడా సస్పెన్సుగా ఉంది. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు తీసుకోవడంపై ఆయన ధర్నాలు చేశారు. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి రాకపోవచ్చనే వాదనలు వినబడుతున్నాయి.