బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (21:50 IST)

రాజకీయ వ్యవస్ధ జీరో అయినప్పుడు మేము హీరోల‌వుతాం... ఎన్జీవోనేత అశోక్ బాబు

విజ‌య‌వాడ ‌: ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకతాటి పైకి వచ్చి డిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ఎపీఎన్జీవో నేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియ

విజ‌య‌వాడ ‌: ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకతాటి పైకి వచ్చి డిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ఎపీఎన్జీవో నేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆర్దిక విధానాలపై సెప్టెంబర్ 2న ఉద్యోగులు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు ఏపి జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుంద‌న్నారు. 
 
ప్రత్యేక హోదానే కాదు, ప్ర‌త్యేక ప్యాకేజీ, పోలవరం నిధుల‌పైనా ఉద్య‌మించాల‌న్నారు. స్పెషల్ స్టేటస్ తేవ‌డం అనేది రాజకీయ వ్యవస్థ‌కి సంబంధించింద‌ని, రాజకీయ బలం చాలకపోతే మేము రోడ్లమీదకి వచ్చి ఉద్యమం చేస్తామ‌ని అశోక్ బాబు చెప్పారు. మేం మళ్ళీ రోడ్లపైకి వస్తే ఏపీ మరింత నష్టపోతుందని రావడంలేద‌ని, తప్పనిసరైతే వస్తాం అన్నారు.  రాజకీయ వ్యవస్ధ జీరో అయినప్పుడు మేము హీరోల‌వుతామ‌ని అశోక్ బాబు చెప్పారు.