గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (15:44 IST)

రూ.10 లక్షల లంచం.. స్టింగ్ ఆపరేషన్‌‍లో అడ్డంగా చిక్కిన ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్!

ఎంసెట్ ప్రశ్నాపత్రం 2 లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ బోగోతం బహిర్గతమైంది.

ఎంసెట్ ప్రశ్నాపత్రం 2 లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ బోగోతం బహిర్గతమైంది. ఈయన గారు... పాఠశాలల యాజమాన్యాల నుంచి రూ.10 లక్షల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. గురువారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రసన్న కుమార్ కొనసాగుతున్నారు. ప్రతి యేడాది బీఈడీ కాలేజీల నుంచి వెరిఫికేషన్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు లంచం స్వీకరిస్తూ వచ్చారు. 
 
ఈ విషయం ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఏసీబీ బాస్ పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు ప్రసన్నకుమార్‌పై నిఘా వేసిన డీఎస్పీ రమాదేవి రెడ్ ఆయనను హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల నుంచి వసూలు చేస్తూ పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.