మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (12:17 IST)

భార్యతో పాటు.. 200 మంది అమ్మాయిలను ఆడుకున్నాడు... నరకం చూపిమరీ...

అతనో ఆర్టీసీ బస్సు డ్రైవర్. కానీ, కట్టుకున్న భార్యతో పాటు ఏకంగా 200 మంది అమ్మాయిలను ఆడుకున్నాడు. అది ఎలాగంటే.. నరకం చూపి మరీ వాడేసుకున్నాడు. 200 మంది అమ్మాయిలను ఆయన ఏ విధంగా వాడుకున్నాడో ఓసారి పరిశీలి

అతనో ఆర్టీసీ బస్సు డ్రైవర్. కానీ, కట్టుకున్న భార్యతో పాటు ఏకంగా 200 మంది అమ్మాయిలను ఆడుకున్నాడు. అది ఎలాగంటే.. నరకం చూపి మరీ వాడేసుకున్నాడు. 200 మంది అమ్మాయిలను ఆయన ఏ విధంగా వాడుకున్నాడో ఓసారి పరిశీలిద్ధాం. 
 
విజయవాడ రూరల్‌ మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన పమిడిపాటి శ్రీనివాసరావు(39) ఆర్టీసీ గవర్నరుపేట డిపోలో కండక్టర్‌. అజిత్‌ సింగ్‌ నగర్‌కు చెందిన పాస్టర్‌ కుమారుడు మార్లపూడి శామ్యుల్‌(30) జులాయి. శ్రీనివాసరావు రూటు నంబర్‌ 48 (అజిత్‌సింగ్‌ నగర్‌) బస్సుపై రెగ్యులర్‌ కండక్టర్‌. ఇదే బస్సులో తరచుగా ప్రయాణం చేయడంతో శామ్యూల్‌తో స్నేహం కుదిరింది.
 
ప్రతి రోజూ బస్సులో ప్రయాణించే మహిళలు, విద్యార్థినుల పాస్‌లను తనిఖీ చేసే సమయంలో వారి ఫోన్లు నంబర్లు శ్రీనివాసరావు నోటు చేసుకునేవాడు. మరికొంతమంది ప్రయాణికులు దిగే హడావుడిలో తమ మొబైళ్లను బస్సులోనే వదిలేస్తుంటారు. అందులోని ఫోన్‌ లిస్టులో ఉన్న మహిళల ఫోన్‌ నంబర్లను అతడు నోట్‌ చేసుకొనేవాడు. 
 
అనంతరం డ్యూటీ దిగాక శామ్యూల్‌తో ఆ సంగతులు పంచుకొనేవాడు. ఇద్దరూ కలిసి ఆ నంబర్లకు బూతు సందేశాలను పంపి పైశాచికానందం పొందేవారు. ఇలా తెలుగు రాష్ట్రాల పరిధిలో వందలమందిని, ఒక్క విజయవాడలోనే రెండు నెలల కాలంలో రెండు వందల అమ్మాయిలను వేధించుకొని తిన్నారు. చివరికి కుటుంబసభ్యులనూ వదిలిపెట్టలేదు. శ్రీనివాసరావు తన భార్యకూ అసభ్య సందేశాలు పంపి.. వికృతానందం పొందేవాడు. చివరకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి... శ్రీనివాసరావును అరెస్టు చేశారు.