శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (10:47 IST)

అరకు ఎంపీ వివాహం... - వైజాగ్‌లో రిసెప్షన్... హాజరుకానున్న సీఎం

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17వ తేదీన జరుగనుంది. ఈమె గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోదరులు మహేశ్, ప్రసాద్‌ వెల్లడించారు. 
 
17వ తేదీ, గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుందని, ఆ తర్వాత విశాఖపట్టణంలో రిసెప్షన్ జరుగుతుందని తెలిపారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో సహా వైకాపా మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.