శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 మే 2015 (14:58 IST)

ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నాం : అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారా లభించే నిధుల కంటే ఎక్కువ నిధులను కేటాయిస్తున్నట్టు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికికు ప్రత్యేక హోదాను ఇచ్చే అంశంపై అన్ని రకాలుగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 
 
ఏపీ పునర్విభజన చట్టంలోని చాలా హామీలు అమలు చేశామన్నారు. అందులోని మరికొన్ని హామీలను అమలు చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో హామీ ఉందని, అదనపు నిధులు ఇస్తున్నందున ప్రత్యేక హోదా అంశాన్ని 14వ ఆర్థిక సంఘం పేర్కొనలేదని గుర్తు చేశారు. 
 
ప్రస్తుతం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అయితే హైదరాబాద్ ను కోల్పోయిన ఏపీకి తగిన వనరులు ఉండేలా చేస్తామని, ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా కింద వచ్చే నిధుల కంటే రాష్ట్రానికి ఎక్కువ నిధులే ఇస్తామని భరోసా కల్పించారు.