శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2016 (19:50 IST)

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరువు కోసం ఆంధ్ర ఇంజినీర్ రూ.364 డిడి, ప్లీజ్ బూట్లు కొనుక్కోండి...

ఆంధ్ర ఇంజినీర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పులు వేసుకుని అలా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు వెళ్లటాన్ని చూళ్లేకపోయారు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విశాఖపట్నానికి చెందిన మెకానికల్ ఇంజినీర్ సుమిత్ కేజ్రీవాల్ 364 రూపాయల డ్రాఫ్ట్ పంపి బూట్లు కొనుక్కోమని ఓ బహిరంగ లేఖ కూడా రాశారు.
 
వివరాల్లోకి వెళితే... రిపబ్లిడ్ డే సందర్భంగా రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ విందుకు అరవింద్ కేజ్రీవాల్ శాండల్ చెప్పులు ధరించి వెళ్లారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పులతో వెళ్లడం దేశాన్ని చిన్నబుచ్చడమేనని సుమిత్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక జత బూట్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారా అంటూ ప్రశ్నించిన సుమిత్ మరో విషయాన్ని కూడా రాశారు.

ఒకవేళ విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందితే తాను పంపిన డబ్బుతో బూట్లు కొనుక్కుని వాటిని ధరించి రావాలని లేఖలో కోరారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ఏం చేస్తారో చూడాలి.