వాచ్ మెన్ కాళ్లు చేతులు కట్టేసి... ఏటిఎంలో చొరబడ్డ దొంగలు
తెల్లవారుజూము కావస్తోంది. చలి చంపేస్తోంది.. వీధి మొదట నుంచి చివరి వరకూ పిక్క కూడా కనపించలేదు. ఇదే అదునుగా భావించిన దోపిడి దొంగలు ఏటిఎంలోకి చొరబడి వాచ్ మెన్ ను విరిచి కాళ్ళు చేతులు కట్టేశారు. ఏటిఎం తెరవడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పరారయ్యారు. వివరాలిలా ఉన్నారు.
కాకినాడ మెయిన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో వాచ్ మెన్ ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున రోడ్డంతా ఖాళీగా ఉన్నారు. దొంగలు ఆ ఏటిఎంపై గురి వేశారు. ఎవరూ రారని నిర్ధారించుకున్న తరువాత అందులో ప్రవేశించి వాచ్మెన్ కాళ్లు, చేతులు కట్టేసి ఓ మూలన పడేశారు. డబ్బు కోసం ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేశారు. తెరుచుకోకపోవడంతో యంత్రాన్ని ధ్వంసం చేశారు.
చాలా సేపు ప్రయత్నం చేసిన దుండగులు ఖాళీ చేతులతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.