గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (14:41 IST)

గోవా తరహాలో విశాఖపట్నం బీచ్ : అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం బీచ్‌ను గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు.
 
కొద్ది రోజుల క్రితమే టెక్నికల్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించిందని అయ్యన్న పాత్రులు తెలిపారు. అచ్యుతాపురంలో ఎయిర్‌పోర్ట్ వద్దని నేవీ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు. 
 
ఒకవేళ అచ్యుతాపురంలో వీలుకాకుంటే భీమిలిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమిలిలో ఉన్న ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమకు కేటాయిస్తామని వెల్లడించారు.