గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (17:28 IST)

ఒకరు ఉరిమారు.. మరొకరు వెక్కిరించారు.. అసెంబ్లీలో బాబు జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో సోమవారం విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పరస్పరం ఇరుకున పెట్టుకోవడానికి పాలక, ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. చంద్రబాబు, జగన్ లు ఒకరిని ఒకరు హావబావాలతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలు నవ్వు తెప్పించాయి. 
 
బాబు హావాభావాలను చూపుతున్న జగన్
రైతు రుణమాఫీ చర్చ జరుగుతుండగా మొదట చాలా సేపు చంద్రబాబు నాయుడు సభలో లేరు. అనంతరం ఆయన విచ్చేశారు. ఆయన రాక మునుపు నుంచే జగన్ మాట్లాడుతున్నారు. చర్చలో భాగంగా జగన్ రైతు రుణమాఫీకి సంబంధించి కేస్ స్టడీలను వివరిస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గత యేడాది ఎలా ఉంది? ఈ యేడాది ఎలా ఉంది? ఎందుకు తక్కువ వచ్చాయనే అంశాలను చెబుతున్నారు. ఇంతలోనే చంద్రబాబు లేచి చాలా సీరియస్ గా అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోతే తామేమి చేయలేమని చెబుతున్నారు.

కొందరు దొంగలను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రతిపక్షంపై మండిపడ్డారు. వారి కోసమే ప్రతిపక్షం ఇలా మాట్లాడుతోందంటూ గుడ్లు ఉరిమి చూశారు. దీనిపై స్పందించిన జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు కళ్ళు ఇంత పెద్దవి చేసి మాట్లాడడం చూస్తుంటే, నిజంగా భయమేస్తుందని అన్నారు. కళ్ళు పెద్దవి చేసి కళ్ళార్పకుండా మరీ అబద్దాలు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసరడంతో సభలో ఘొల్లున నవ్వులు వినిపించాయి.