మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (15:39 IST)

పోలవరం కోసం ముష్టి వేస్తారా? : కేంద్రంపై బాలకృష్ణ!

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంను పూర్తి చేసేందుకు రూ.1600 కోట్ల నిధులు కావాల్సి ఉండగా, రూ.100 కోట్లు ముష్టిగా కేటాయిస్తారా అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు. రాజ్యసభ వేదికగా ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ప్రకటన చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. 
 
వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయంలో లేని ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ విషయంలో వచ్చిందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే జనం తిరగబడతారని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ సోమవారం రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతున్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు.